గంజాయి తరలింపు కేసులో ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2021-04-21T05:50:48+05:30 IST
ఆర్టీసీ బస్లో గంజాయి తరలింపు కేసులో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్టు అర్బన్ ఎస్పీ షిమొషిబాజ్పాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 20: ఆర్టీసీ బస్లో గంజాయి తరలింపు కేసులో ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్టు అర్బన్ ఎస్పీ షిమొషిబాజ్పాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న ప్రకాష్నగర్ సీఐ పి.శ్రీనివాస్కు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లి కాకినాడ నుంచి బెంగుశూరు వెళ్తున్న అమరావతి బస్ను తనిఖీ చేశారు. ఆ బస్లో కాకినాడ ఆర్టీసీ లాజస్టిక్ సర్వీస్లో పార్సిల్గా బెంగుళూరుకు బుక్ చేసిన రెండు అట్టపెట్టెలను తనిఖీ చేయగా రూ.1.45 లక్షల విలువైన 15 కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు బోడపాటి తేజకిరణ్, గురుచరణ్ సిమ్రాన్జిత్సింగ్లను రాజమహేంద్రవరంలో అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారని ఎస్పీ తెలిపారు.