hosuru: గంజాయి స్వాధీనం: తండ్రీ కొడుకుల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-15T15:20:55+05:30 IST

హోసూరు కొత్తూరులోని ఓ ఇంటిలో దాచి ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు సిప్‌కాట్‌ పోలీసులు దాడు

hosuru: గంజాయి స్వాధీనం: తండ్రీ కొడుకుల అరెస్టు

hosuru(karnataka): హోసూరు కొత్తూరులోని ఓ ఇంటిలో దాచి ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు సిప్‌కాట్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంట్లో 2కిలోల గంజాయి లభించింది. ఈ మేరకు పట్టాభిరామన్‌ (46), కుమారుడు వెంకటేశ్‌(19)లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో పట్టాభిరామన్‌ ఓ హత్యకేసులో నిందితుడు జామీనుపై బయట ఉన్నట్లు తెలిసింది. నిందితుల ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2021-10-15T15:20:55+05:30 IST