రూ.60 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-06-17T05:06:32+05:30 IST
చేబ్రోలు రైల్వే గేటు వద్ద పోలీసుల తనిఖీల్లో 961.2 కిలోల గంజాయి పట్టుబడినట్టు ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ పేర్కొన్నారు.
ఉంగుటూరు, జూన్ 16: చేబ్రోలు రైల్వే గేటు వద్ద పోలీసుల తనిఖీల్లో 961.2 కిలోల గంజాయి పట్టుబడినట్టు ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ పేర్కొన్నారు. బుధవారం చేబ్రోలు పోలీసు స్టేషన్లో విలేకరులతో మాట్లాడు తూ విశాఖ జిల్లా సీలేరు అటవీ ప్రాంతం నుంచి హైదరాబాదు కు ఏపీఏ5డబ్ల్యు 8699 నెంబరు గల లారీ క్యాబిన్లో దాచి తీసుకు వెళుతున్న రూ. 60 లక్షల విలువైన గంజాయితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఒడిశాకు చెందిన రసానంద పధస్, సుబోధ్ పధస్లను అరెస్టు చేశామన్నారు. గణపవరం సీఐ వి.వెంకటేశ్వర రావు, చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు పాల్గొన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు.