ఆటోలో వంద కిలోల గంజాయి తరలింపు
ABN , First Publish Date - 2021-02-16T04:51:27+05:30 IST
గంజాయిముఠా రట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ. 15 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ముఠాసభ్యులకు షాక్ ఇచ్చారు.
టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో ముఠా గుట్టు రట్టు
కారేపల్లి ఫిబ్రవరి15: గంజాయిముఠా రట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ. 15 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ముఠాసభ్యులకు షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. ఆటోలో తరలిస్తున్న రూ.15 లక్షల విలువల గల వందకేజీల గంజాయిని సోమవారం సాయంత్రం మండల కేంద్రానికి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా .. బూర్గంపాడు నుంచి ఓ అటోలో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. ఈతనిఖీల్లో ఖమ్మం ఏసీ పీ వెంకట్రావు, కారేపల్లి రూరల్ సీఐ శ్రీనివా్స పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులైన రమేష్, భూక్యా కిషోర్, ఆటోడ్రైవర్ రవిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివా్స తెలిపారు.