Gannavaram ఎయిర్పోర్టు వద్ద బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం
ABN , First Publish Date - 2022-06-06T17:39:18+05:30 IST
గన్నవరం విమానాశ్రయం వద్ద బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
విజయవాడ: గన్నవరం విమానాశ్రయం వద్ద బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి అనుమతిండం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జాబితాలో లేని పేర్లను పంపడం సాధ్యం కాదని ఎయిర్పోర్టు అధికారులు తేల్చిచెప్పారు. దీంతో విమానాశ్రయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు.