స్వచ్ఛంద పదవీ విరమణకు గంటా మోహన్ దరఖాస్తు
ABN , First Publish Date - 2022-10-02T05:21:06+05:30 IST
రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు.
చిత్తూరు (సెంట్రల్), అక్టోబరు 1: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఈ మేరకు దరఖాస్తును శనివారం డీఈవో పురుషోత్తంకు సమర్పించారు. ఎస్టీయూ ఉమ్మడి చిత్తూరు జిల్లా కౌన్సిల్ సమావేశం తీర్మానంతో పాటు తూర్పు రాయలసీమ ఎస్టీయూ నాయకుల అభిప్రాయం మేరకు శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమం కోసం తన 18 సంవత్సరాల సర్వీసును త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు దేవరాజులు, నాయకులు మదన్మోహన్, పరందామతో కలిసి దరఖాస్తును డీఈఓకు సమర్పించారు.