విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన గంటా

ABN , First Publish Date - 2021-03-04T16:17:52+05:30 IST

పార్టీ మారే ఉద్దేశమే లేదని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక వేళ మారాల్సి వస్తే..

విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన గంటా

విశాఖ: పార్టీ మారే ఉద్దేశమే లేదని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక వేళ మారాల్సి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మైండ్ గేమ్ ఆడాల్సిన పని తనకు లేదని, పార్టీలో ఏ ఒక్కరి చేరికలవల్ల పెద్ద ప్రయోజనం ఉండదని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గంటా కౌంటర్‌ ఇచ్చారు. తాను కొన్ని ప్రతిపాదనలు పంపానని చెప్పిన విజయసాయి.. అవేంటో ఆయనే చెప్పాలన్నారు. ఈ సందర్భంగా గంటా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తినని అన్నారు. 30 ఏళ్ల వయసులో ఎంపీ అయ్యానని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా చేశానన్నారు. తనకు టీడీపీలో ఏమైన ఇబ్బందులు ఉంటే, పార్టీ మారాలని అనుకుంటే.. రహస్యంగా, సాధారణ కార్యకర్తలా పోయే పరిస్థితిలేదన్నారు. తనకేమైనా ఇబ్బందులు ఉంటే.. చంద్రబాబును కలిసి సమస్యలు చెప్పి.. పార్టీ మారతానని చెబుతానని, చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విజయసాయి చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగించాయని గంటా అన్నారు.

Updated Date - 2021-03-04T16:17:52+05:30 IST