సూర్యోపనిషత్తు వ్యాఖ్యాన గ్రంథావిష్కరణ

ABN , First Publish Date - 2021-07-26T05:59:04+05:30 IST

స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్‌, ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేట ఆధ్యాత్మిక జ్ఞానపీఠ వ్యవస్థాపకుడు దేవిశెట్టి చలపతిరావు రచించిన సూర్యోపనిషత్‌ వ్యాఖ్యాన గ్రంథావిష్కరణ జరిగింది.

సూర్యోపనిషత్తు వ్యాఖ్యాన గ్రంథావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు (సాంస్కృతికం), జూలై 25: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్‌, ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేట ఆధ్యాత్మిక జ్ఞానపీఠ వ్యవస్థాపకుడు దేవిశెట్టి చలపతిరావు రచించిన సూర్యోపనిషత్‌ వ్యాఖ్యాన గ్రంథావిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిషనర్‌ చల్లా అనురాధ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అఽధ్యక్షుడు సీహెచ్‌ మస్తానయ్య, భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ - లలితాంబ దంపతులు, వూటుకూరు నాగేశ్వరరావు, బొర్రా ఉమామహేశ్వరరావు, లంకా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కేతినేని శ్రీహరిరావు పర్యవేక్షించారు. 

Updated Date - 2021-07-26T05:59:04+05:30 IST