Naga Babu Tweet: చిరంజీవిపై గరికపాటి అసహనం.. చిరంజీవి సైలెంట్.. వదలని నాగబాబు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-10-07T01:34:44+05:30 IST

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ‘అన్నయ్య’ మీద ఈగ వాలినా ఊరుకోడు. ‘తమ్ముడు’ పవన్‌ను ఎవరైనా ఏమైనా అంటే..

Naga Babu Tweet: చిరంజీవిపై గరికపాటి అసహనం.. చిరంజీవి సైలెంట్.. వదలని నాగబాబు ఏం చేశాడంటే..

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ‘అన్నయ్య’ మీద ఈగ వాలినా ఊరుకోడు. ‘తమ్ముడు’ పవన్‌ను ఎవరైనా ఏమైనా అంటే సోషల్ మీడియా సాక్షిగా కౌంటర్ చేస్తూ వీడియోలతో చెడుగుడు ఆడేసుకున్న ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. తాజాగా మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబు (Naga Babu Tweet) ఆ తరహా ట్వీటే చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే.. ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశాడో తెలియాలంటే ఇవాళ జరిగిన ఒక పరిణామం గురించి తొలుత తెలియాలి. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ‘అలయ్‌బలయ్’ (Alai Balai) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాజంలోని విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi), మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు (Garikapati) కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు (Chiranjeevi Photos) దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు. చిరంజీవి కూడా ఎవరినీ నొప్పించకుండా అందరికి ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం ఇబ్బందిగా అనిపించింది.



దీంతో.. అసహనానికి గురైన గరికపాటి (Garikapati Serious On Chiranjeevi) ‘‘అక్కడ మొత్తం ఫొటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను’’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతసేపటికి చిరంజీవి వెళ్లి గరికపాటి పక్కనే కూర్చుని ప్రవచనం విన్నారు. ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్నారు. చిరంజీవి క్షమాపణ చెప్పి గరికపాటిని భోజనానికి ఆహ్వానించినట్టుగా కూడా వార్తలొచ్చాయి. అంతటితో ఆ చిన్నపాటి వివాదాస్పద పరిణామానికి శుభం కార్డు పడింది. అయితే.. ఆ వీడియో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. మెగా అభిమానులు చిరంజీవితో గరికపాటి అలా అనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో గరికపాటి నరసింహారావుపై విరుచుకుపడ్డారు.



గరికపాటిని ట్రోలింగ్ చేసిన కొందరు మెగా అభిమానులకు నాగబాబు కూడా ఈ వ్యవహారంపై ట్వీట్ చేయడం కొండంత బలానిచ్చినట్టయింది. గరికపాటిని ఉద్దేశించి ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’ అని నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం ముగిసిపోయిన ఈ చిన్నపాటి వివాదాన్ని మరింత హైలైట్ చేసినట్టయింది. నాగబాబు ట్వీట్ చేయడాన్ని కొందరు మెగా అభిమానులు సమర్థిస్తుండగా.. కొందరు నెటిజన్లు తప్పుబడుతుండటం గమనార్హం. నాగబాబు తాజా ట్వీట్.. లేని వివాదానికి తెరలేపినట్టయిందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. చిరంజీవి అంత హుందాగా వివాదానికి ముగింపు పలికితే అనవసరంగా అతిగా స్పందిస్తూ మెగాస్టార్ ఇమేజ్‌ను పరోక్షంగా నాగబాబు దిగజార్చుతున్నాడని కొందరు మెగా అభిమానులు కూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం విశేషం.

Updated Date - 2022-10-07T01:34:44+05:30 IST