తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి
ABN , First Publish Date - 2021-01-25T19:29:34+05:30 IST
తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. శ్రీనివాసం వద్ద
చిత్తూరు: తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. శ్రీనివాసం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలన సృష్టిస్తోంది. ప్రమాద స్థలిని మున్సిపల్ కమిషనర్ గిరీష పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.