గ్యాస్...మంట
ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST
సామాన్య మధ్యతరగతి కుటుం బాల వారికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ షాక్ ఇచ్చింది.
మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధర
మేనెలలోనే రెండు సార్లు పెరిగిన ధరలు
సిలిండర్కు రూ.3.50 పెంపు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1028
వినియోగదారుల గగ్గోలు
ఏలూరుసిటీ, మే 19: సామాన్య మధ్యతరగతి కుటుం బాల వారికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ సిలిండర్ ధర (ఎల్పీజీ) మళ్లీ పెంచింది. ఈ సారి సిలిండర్కు రూ.3.50 మాత్రమే పెంచింది. ఈ నెలలో రెండు సార్లు వంట గ్యాస్ ధరలు పెంచింది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు పెరుగుదల కారణంగా వంట గ్యాస్ ధరలు పెంచక తప్పటం లేదని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. గత మార్చి నెలాఖరులో వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచారు. మళ్ళీ మేనెల మొదటి వారంలో 50 రూపాయలు పెంచారు. తాజాగా రూ.3.50 వరకు పెంచారు. తాజా ధరతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సిలిండరు ధర రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో రూ.1028 మరికొన్ని ప్రాంతా ల్లో రూ.1036 ధరలకు అమ్ముతున్నారు. ఈ పెరుగుదలను చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
రోజువారీ వినియోగం 15వేలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12.90 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రోజువారీ 15వేల గ్యాస్ సిలిండర్లు వినియోగం జరుగుతోంది. తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరలతో వినియోగదారులపై రోజువారీ 52,500 రూపాయల వరకు భారం పడుతోంది.