గతి రూ.80 కోట్ల సమీకరణ

ABN , First Publish Date - 2021-05-09T06:15:07+05:30 IST

గతి లిమిటెడ్‌ నిధులు సమీకరించనుంది. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా షేర్లు, ఈక్విటీ వారెంట్లు జారీ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది...

గతి రూ.80 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గతి లిమిటెడ్‌ నిధులు సమీకరించనుంది. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా షేర్లు, ఈక్విటీ వారెంట్లు జారీ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.95.75 ప్రీమియంతో జారీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 10.23 లక్షల షేర్లను జారీ చేసి రూ.10 కోట్ల వరకు సమీకరించనుంది. రూ.97.75ఽ ధరకు 71.61 లక్షల ఈక్విటీ వారెంట్లను కేటాయించనుంది. వారెంట్ల ద్వారా రూ.69.99 కోట్ల నిధులు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

Updated Date - 2021-05-09T06:15:07+05:30 IST