33 ఏళ్ల క్రితం కేటాయించిన స్థలాన్ని వెనక్కిచ్చేసిన గవాస్కర్‌!

ABN , First Publish Date - 2022-05-05T09:26:23+05:30 IST

మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర సర్కారు తనకు కేటాయించిన స్థలాన్ని దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ వెనక్కిచ్చేశాడు.

33 ఏళ్ల క్రితం కేటాయించిన  స్థలాన్ని వెనక్కిచ్చేసిన గవాస్కర్‌!

ముంబై: మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర సర్కారు తనకు కేటాయించిన స్థలాన్ని దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ వెనక్కిచ్చేశాడు. క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు కోసం బాంద్రా వెస్ట్‌ ప్రాంతంలో 1980లో 21,348 చదరపు అడుగుల (2,372 గజాలు) స్థలాన్ని సునీల్‌ గవాస్కర్‌ క్రికెట్‌ ఫౌండేషన్‌కు ప్రభుత్వం కేటాయించింది. మూడేళ్లలో అకాడమీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని షరతు విధించింది. కానీ, ఇతర ఒప్పందాల కారణంగా ఆ ప్రాజెక్ట్‌పై సన్నీ దృష్టిపెట్టలేక పోయాడు. కాగా, 2019లో సచిన్‌తో సంయుక్తంగా అకాడమీ ఏర్పాటు చేస్తామని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కలసి ప్రతిపాదన చేశారు. అయితే, అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న ఆ స్థలాన్ని స్వాధీనం చేయాల్సిందిగా మహారాష్ట్ర గృహ నిర్మాణాభివృద్ధి సంస్థ.. సన్నీ ఫౌండేషన్‌కు నోటీసులు పంపింది. దీంతో అత్యంత ఖరీదైన ఈ ప్లాట్‌ను గవాస్కర్‌ తిరిగి ఇచ్చేశాడు.

Read more