నూతన కాగ్ జీసీ ముర్ము ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2020-08-08T16:32:35+05:30 IST
భారత నూతన ‘కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్)గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం..
న్యూఢిల్లీ: భారత నూతన ‘కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్)గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి కోవిడ్-19 నిబంధనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహెర్షి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. కాగా జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ముర్ము రెండు రోజుల క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.