జీసీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-23T05:43:00+05:30 IST

గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి కోరారు.

జీసీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
గ్యాస్‌ గొడౌన్‌ను ప్రారంభిస్తున్న జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి



జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి 

జి.మాడుగుల, జనవరి 22: గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి కోరారు. శనివారం ఆమె మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ బ్రాంచి కార్యాలయంలో జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన ఇండేన్‌ గ్యాస్‌ గొడౌను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గ్యాస్‌ గొడౌన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అలాగే గిరిజన రైతులు పండించే అపరాలు, సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా అమ్మకాలు చేపట్టి ఆర్థికంగా లబ్ధిపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, ట్రైకార్‌ చైర్మన్‌ ఎస్‌.బుల్లిబాబు, రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ టి.నరసింగరావు, జీసీసీ డీఎం కె.పార్వతమ్మ, ఎంపీపీ కె.పద్మ, వైస్‌ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-23T05:43:00+05:30 IST