పిడుగుపాటుకు గేదె మృతి
ABN , First Publish Date - 2021-10-17T05:12:47+05:30 IST
శనివారం మండలంలోని రేబాల పొలాల్లో రైతు తిరుపతిరెడ్డి గేదెలు మేపుకుంటుండగా పిడుగుపాటుకు గురై సుమారు రూ. 60వేలు విలువ చేసే గేదె మృతిచెందింది.
బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు16 : శనివారం మండలంలోని రేబాల పొలాల్లో రైతు తిరుపతిరెడ్డి గేదెలు మేపుకుంటుండగా పిడుగుపాటుకు గురై సుమారు రూ. 60వేలు విలువ చేసే గేదె మృతిచెందింది. బుచ్చిరెడ్డిపాళెంలోని సుహాసిని నగర్లో ఓ ఇంటిపైన పిడుగు పడింది. దీంతో ఆ ఇంటి సన్సైడ్పైన పగుళ్లిచ్చాయి.