National Herald కేసులో ఈడీ ఎదుట గీతారెడ్డి
ABN , First Publish Date - 2022-10-06T16:32:53+05:30 IST
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో మాజీ మంత్రి గీతారెడ్డి (Geetha Reddy), గాలి అనిల్కుమార్ (Gali Anil kumar)
Delhi : నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో మాజీ మంత్రి గీతారెడ్డి (Geetha Reddy), గాలి అనిల్కుమార్ (Gali Anil kumar) ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 3న ఈడీ ముందు మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాజరయ్యారు. మొత్తం ఐదుగురు కాంగ్రెస్ నేతల (Congress Leaders)కు ఈడీ నోటీసులు ఇచ్చారు. యంగ్ ఇండియా లిమిటెడ్ (Young India Limited) కు విరాళాలు ఇచ్చిన వారిని ఈడీ విచారణ జరుపుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, అనిల్ కుమార్లను ఈడీ విచారణకు పిలిచింది. మంగళవారం ఈడీ ముందుకు రావాల్సి ఉన్నా... నేతలెవరూ హాజరు కాలేదు.