గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : పోలంరెడ్డి
ABN , First Publish Date - 2022-08-12T03:52:40+05:30 IST
క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి పోలంరెడ్డి శ్రీనివాసుల
కొడవలూరు, ఆగస్టు 11 : క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గురువారం కొడవలూరు మండలం రాజుపాళెంలో బుచ్చి మండల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలంరెడ్డి మాట్లాడుతూ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు వారి బాధ్యతలను గుర్తించి, టీడీపీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకుని లోపాలను సరిచేయించాలన్నారు. అన్నీ కమిటీలు సమర్ధవంతంగా పనిచేస్తేనే రాబోయే ఎన్నికల్లో గెలుపు తధ్యమని తెలిపారు. ఈ సమావేశంలో బుచ్చి మండల క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల కన్వీనర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.