రోడ్డుపై నడిచి వెళ్తూ కుప్ప కూలి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-04T03:44:41+05:30 IST
రోడ్డుపై నడిచి వెళ్తూ హఠాత్తుగా కుప్పకూలి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన పట్టణంలో గురువారం రాత్రి జరిగింది.
కందుకూరు, డిసెంబరు 3 : రోడ్డుపై నడిచి వెళ్తూ హఠాత్తుగా కుప్పకూలి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన పట్టణంలో గురువారం రాత్రి జరిగింది. మోర్ షోరూం ఎదుట హఠాత్తుగా కుప్పకూలిన యువకుడు నోరు, ముక్కులోంచి రక్తం కారింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ తిరుపతిరావు హుటాహుటిన 108లో ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆ యువకుడు మృతిచెందాడు. ఫిట్స్ కారణ ంగా అధికరక్తస్రావమై ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు యువకుడు ఎవరన్నది తేలలేదు.