ఎన్నికలకు సమాయత్తం కావాలి: Pawan Kalyan

ABN , First Publish Date - 2022-06-25T02:21:22+05:30 IST

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించారు.యువకులు, వీర మహిళలు,

ఎన్నికలకు సమాయత్తం కావాలి: Pawan Kalyan

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించారు.యువకులు, వీర మహిళలు, కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ, సామాజిక పరిస్థితులు, ప్రజా సమస్యలను వారి నుంచి  తెలుసుకున్నారు.


   ప్రజాపక్షాన ఉంటూ.. పార్టీ పక్షాన నిర్వర్తించాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర అవగాహనతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతకు అవసరమైన రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులతో భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, డివిజన్ స్థాయి సమావేశాల‌పై పవన్ స్పష్టత ఇచ్చారు.

Updated Date - 2022-06-25T02:21:22+05:30 IST