వలంటీర్ల ద్వారా ఓట్లు పొందుతున్నారు

ABN , First Publish Date - 2021-04-12T19:55:05+05:30 IST

పార్లమెంట్ ఉప ఎన్నికలలో గెలవడానికి వలంటీర్ల ద్వారా ప్రజలను భయపెట్టి వైసీపీ నాయకులు

వలంటీర్ల ద్వారా ఓట్లు పొందుతున్నారు

తిరుపతి: పార్లమెంట్ ఉప ఎన్నికలలో గెలవడానికి వలంటీర్ల ద్వారా ప్రజలను భయపెట్టి వైసీపీ నాయకులు ఓట్లు పొందుతున్నారని టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు పోకుండా వలంటీర్లతో వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. వలంటీర్ల ద్వారా ప్రజలను భయపెట్టి ఓట్లు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. వలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి ఎన్నికలు జరపండి, వైసీపీ పరిస్థితి ఏంటో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. 


ఉప ఎన్నికలలో గెలవడానికి రెండు లక్షల దొంగ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. పద్ధతిగా ఎన్నికలు జరిగితే లక్ష ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి జీవితకాలంలో మంత్రి అయ్యి రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో జిల్లాకు ఆయన ఏ మంచి పని చేశారో చెప్పాలని నల్లారి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-04-12T19:55:05+05:30 IST