18 మందికి ఈఎనటీ స్ర్కీనింగ్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-10-24T05:27:14+05:30 IST
వినికిడి లోపంతో ఉన్న పిల్లలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన శస్త్రచికిత్సలు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో అందుబాట్లోకి వచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు.
కాక్లియర్ సర్జరీకి ఐదుగురి ఎంపిక
నేడూ స్ర్కీనింగ్ శిబిరం కొనసాగింపు
గుంటూరు (మెడికల్), అక్టోబర్ 23: వినికిడి లోపంతో ఉన్న పిల్లలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన శస్త్రచికిత్సలు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో అందుబాట్లోకి వచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు. శనివారం ప్రభుత్వాస్పత్రిలో ఈఎనటీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాక్లియర్ సర్జరీ స్ర్కీనింగ్ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. సుమారు రూ.7 లక్షల విలువైన కాక్లియర్ ఆపరేషనలు ఇకపై జీజీహెచలో ఉచితంగా నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఆదివారం కూడా ఈ స్ర్కీనింగ్ శిబిరం జరుగుతుందని డాక్టర్ ప్రభావతి తెలిపారు. ఈఎనటీ విభాగం ఇనచార్జ్ హెచవోడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ శనివారం 18మంది పిల్లలకు స్ర్కీనింగ్ పరీక్షలు జరిపామని, ఇందులో ఐదుగురిని ఆపరేషనల కోసం ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సర్జన ఆర్ఎంవో డాక్టర్ సతీష్కుమార్, డాక్టర్ సంపతకుమార్, డాక్టర్ అనిత, డాక్టర్ అరుణ్కుమార్, అపోలో ఆసుపత్రి ఈఎనటీ వైద్యులు శ్రీరామ్, శ్రీకాంత, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజు తదితరులు పాల్గొన్నారు.