ఘనంగా ఉరుసు మహోత్సవం
ABN , First Publish Date - 2021-11-29T05:23:10+05:30 IST
పట్టణంలోని పోలీసుస్టేషన్ సమీపంలో శ్రీహజరత్ దస్తగిరి మాబుసుభాని స్వామి దర్గాలో ఉరుసు మహోత్సవం వైభంగా జరిగింది.
గిద్దలూరు, నవంబరు 28 : పట్టణంలోని పోలీసుస్టేషన్ సమీపంలో శ్రీహజరత్ దస్తగిరి మాబుసుభాని స్వామి దర్గాలో ఉరుసు మహోత్సవం వైభంగా జరిగింది. హిందూ ముస్లింలు ఉరుసులో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షహన్షావలి, మాజీ అధ్యక్షుడు మస్తాన్, పలువురు టీడీపీ నాయకులు ఉరుసు మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
గ్యార్మీ పండుగలో పాల్గొన్న అశోక్రెడ్డి
పట్టణంలోని గణేష్నగర్లో గల మాబుసుభాని స్వామి దర్గాలో ఆదివారం రాత్రి గ్యార్మీ పండుగను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, పలువురు టిడిపి నాయకులు గ్యార్మీ పండుగలో పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాంబాబు
పట్టణంలోని అర్బన్కాలనీలో గల సయ్యద్ దస్తగిరిస్వామి మాబుసుభా ని దర్గా 14వ ఉరుసు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఎ మ్మెల్యే అన్నా రాంబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా నిర్వాహకు లు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే రాంబాబుకు ప్రసాదం అందచేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.