సీడ్స్ బిజినెస్ పేరుతో ఘరానా మోసం
ABN , First Publish Date - 2022-03-12T03:09:57+05:30 IST
సీడ్స్ బిజినెస్ పేరుతో 34 లక్షల రూపాయలను మోసం చేసిన
హైదరాబాద్: సీడ్స్ బిజినెస్ పేరుతో 34 లక్షల రూపాయలను మోసం చేసిన ఘటన నగరంలో జరిగింది. ఫేస్బుక్లో బాధితుడికి ఓ మహిళ పరిచయం అయింది. అనంతరం సీడ్స్ బిజినెస్లో అధిక లాభాలు వస్తాయని బాధితుడిన ఆ మహిళ నమ్మించింది. యూకేలో అధిక ధరకు కొంటామని లేడీ నమ్మించింది. మహిళ పేరుతో 34 లక్షల రూపాయలను నైజీరియన్స్ కాజేశారు. తనకు జరిగిన మోసంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.