యలమంచిలిలో ఘరానా టోకరా
ABN , First Publish Date - 2021-11-26T01:27:22+05:30 IST
జిల్లాలోని యలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు
విశాఖ: జిల్లాలోని యలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఘరానా టోకరా వేశాడు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తి టూవీలర్ డిక్కీలో నుంచి 30 లక్షలు మాయం అయ్యాయి. బాధితుడిని నారాయణపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి కావలసిన ఆధారాల కోసం క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.