పాతబస్తీకి జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు

ABN , First Publish Date - 2022-05-04T15:06:40+05:30 IST

భాగ్యనగరంలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.

పాతబస్తీకి జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు

హైదరాబాద్: భాగ్యనగరంలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలను బల్దియా అప్రమత్తం చేసింది. భారీ వర్షానికి పాతబస్తీలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వెంటనే జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు ఓల్డ్ సిటీకి చేరుకున్నాయి. ఈరోజు(బుధవారం) తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పుగూడ, శాలిబండ, తలాబ్ కట్ట, ఛత్రినాకలో కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. చాంద్రాయణగుట్ట, బాబా నగర్, పిస్సల్ బండ, యకుత్‌పురాలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 

Read more