ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లపై బల్దియా ఫొకస్

ABN , First Publish Date - 2021-08-26T22:50:28+05:30 IST

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడి గంట మోగనుంది. దీంతో గ్రేటర్ హైదరబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లపై బల్దియా ఫొకస్

హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడి గంట మోగనుంది. దీంతో గ్రేటర్ హైదరబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో శానిటైజేషన్‌పై బల్దియా ఫొకస్ పెట్టింది. వారం రోజుల పాటు నగరంలోని స్కూళ్లలో శానిటైజేషన్‌తో పాటు ఫాగింగ్, క్లీనింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కరోనా, డెంగీ కేసుల నేపథ్యంలో స్కూళ్ల పరిశుభ్రత కోసం మొత్తం 750 ఎంటమాలజీ బృందాలతో శానిటైజ్ చేస్తున్నట్టు బల్దియా అధికారులు చెబుతున్నారు. 


తెలంగాణలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కాబోతోంది. బడులు తెరిచేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాలను విద్యాశాఖ రూపొందించింది. గత రెండేళ్లుగా విద్యావ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయిందని విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో ఇక నుంచి ప్రత్యక్ష బోధనకే మొగ్గు చూపినట్టు సర్కార్ చెబుతోంది. 


Updated Date - 2021-08-26T22:50:28+05:30 IST