TV9కు షాకిచ్చిన GHMC.. ఎందుకంటే...!

ABN , First Publish Date - 2022-01-04T13:27:45+05:30 IST

TV9కు షాకిచ్చిన GHMC.. ఎందుకంటే...!

TV9కు షాకిచ్చిన GHMC.. ఎందుకంటే...!

హైదరాబాద్‌ సిటీ : నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు ఏర్పాటుచేసిన పలు సంస్థలకు జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) సోమవారం జరిమానా విధించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-3లో ఓ భవనానికి నిర్ణీత స్థాయి ఎత్తుని మించి టీవీ-9 బోర్డు ఏర్పాటు చేసిందని నెటిజన్‌ ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఈవీడీఎం ఆ సంస్థకు రూ.లక్ష పెనాల్టీ వేస్తూ ఈ-చలానా జనరేట్‌ చేశారు. పురపాలక శాఖ నయా నిబంధనల ప్రకారం 15 అడుగుల కంటే ఎత్తులో సంస్థల పేర్లు, ఇతరత్రా బోర్డులు ఏర్పాటు చేయకూడదు. భవనం ముందువైపు విస్తీర్ణానికి 15 శాతానికి మించకుండా బోర్డు ఉండాలి. కేపీహెచ్‌బీలోని చట్నీస్‌కూ రూ.లక్ష జరిమానా విధించారు. హుస్సేన్‌సాగర్‌ నాలా రిటైనింగ్‌ పనుల శంకుస్థాపనకు హాజరైన మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. రూ.15 వేలు పెనాల్టీ వేశారు.

Updated Date - 2022-01-04T13:27:45+05:30 IST