Hyderabad: చెత్తను ఆటోలకు ఇవ్వాలి..
ABN , First Publish Date - 2022-06-19T17:51:44+05:30 IST
రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెత్తను ఆటోలకు ఇవ్వాలంటూ
వినూత్న పద్ధతిలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిరసన
హైదరాబాద్/రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెత్తను ఆటోలకు ఇవ్వాలంటూ అపార్ట్మెంట్ల ముందుకు వెళ్లి మైకుతో నినాదాలు చేస్తూ నిరసనను వ్యక్తం పరిచారు. అత్తాపూర్ రాంబాగ్ శివాజీనగర్ ప్రాంతంలో ఆరు పోర్షన్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్ నివాసితులకు చెత్తను ఆటోలకు ఇవ్వాలని రాజేంద్రనగర్ సర్కిల్ ఇన్చార్జి ఏఎంహెచ్ఓ ఆంజనేయులు, శానిటరీ సూపర్వైజర్ క్రిష్ణకిషోర్తో పాటు సిబ్బంది పలుమార్లు విన్నవించినా వారు స్పందించలేదు. దీంతో వారు ఇలా తమ నిరసనను వ్యక్తం చేశారు. వారాంతపు సంతలలో కుళ్లిపోయిన, పాడైన కూరగాయలను మైదానం, రోడ్లపైన వదిలిపెట్టి వెళ్లకూడదని పారిశుధ్య సిబ్బంది విజ్ఞప్తి చేశారు.