చెత్త తరలింపునకు అత్యాధునిక భారీ వాహనాలు

ABN , First Publish Date - 2022-03-02T16:34:38+05:30 IST

హైదరాబాద్ నగరంలో చెత్త తరలింపునకు అత్యాధునిక భారీ వాహనాలను వినియోగించనున్నట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది.

చెత్త తరలింపునకు అత్యాధునిక భారీ వాహనాలు

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చెత్త తరలింపునకు అత్యాధునిక భారీ వాహనాలను వినియోగించనున్నట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది. 40 కొత్త ట్రక్కులను మంత్రి కేటీఆర్, తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలించేందుకు భారీ ట్రక్కులను ఏర్పాటు చేశారు. రాంకీ సంస్థ ఈ ట్రక్కులను ఏర్పాటు చేసింది. ఈ వెహికల్స్ అందుబాటులోకి వస్తే రోజూ 6,500 టన్నుల చెత్తను నగరం నుంచి జవహర్ నగర్ డంప్‌నకు తరలించనున్నారు.

Updated Date - 2022-03-02T16:34:38+05:30 IST