అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో ఘోరం
ABN , First Publish Date - 2021-06-07T23:58:22+05:30 IST
జిల్లాలోని అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో ఘోరం జరిగింది. దీంతో కిమ్స్ కోవెడ్
తూర్పుగోదావరి జిల్లా: జిల్లాలోని అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో ఘోరం జరిగింది. దీంతో కిమ్స్ కోవిడ్ హాస్పిటల్ వద్ద ఆందోళన నెలకొంది. ఆసుపత్రిలో కోవిడ్తో ఓ వ్యక్తి చేరాడు. అయితే ఆ వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా ఆసుపత్రి సిబ్బంది ఒక మృతదేహానికి బదులు మరో మృతదేహాన్ని ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక వర్గం ఆ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించింది. తమ మృతదేహం తమకు కావాలంటూ మరో వర్గం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేసింది. దీంతో కిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కిమ్స్ హాస్పిటల్లో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు సమాచారం.