జాతీయ స్థాయి క్రీడల్లో గిద్దలూరు యువకుడికి బంగారు పతకం
ABN , First Publish Date - 2021-11-29T05:09:53+05:30 IST
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో గిద్దలూరు గ్రామానికి చెందిన మీనుగ ప్రసాద్ బంగారు పతకం సాధించినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు.
సంజామల, నవంబరు 28: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో గిద్దలూరు గ్రామానికి చెందిన మీనుగ ప్రసాద్ బంగారు పతకం సాధించినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గోవాలో అండర్-19 జాతీయస్థాయి 800 మీటర్ల విభాగం పరుగు పందెం పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అలాగే ప్రసాద్ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రసాద్ తండ్రి ఇటీవలే మృతి చెందాడు. తల్లి లక్ష్మీదేవి కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తోంది. ప్రసాద్ నంద్యాల పట్టణంలో డిగ్రీ చదువుతున్నాడు.