ఉత్సాహంగా గిరి ప్రదక్షిణ

ABN , First Publish Date - 2022-07-13T01:53:31+05:30 IST

విశాఖపట్నం: సింహాచలం గిరి ప్రదక్షిణ ఉత్సాహంగా కొనసాగుతోంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర రహదారులు భక్తులతో

ఉత్సాహంగా గిరి ప్రదక్షిణ

విశాఖపట్నం: సింహాచలం గిరి ప్రదక్షిణ ఉత్సాహంగా కొనసాగుతోంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి  భారీగా తరలివచ్చారు. సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర రహదారులు భక్తులతో కిటకిటలాడాయి. అప్పన్న నామస్మరణతో మారుమోగాయి. నడక మార్గంలో భక్తుల కోసం మంచినీరు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు.  నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 


సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. సింహగిరి ప్రదక్షిణం.. భూ ప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పుణ్యం లభిస్తుందన్నది కొందరు విశ్వసిస్తారు. సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.

Updated Date - 2022-07-13T01:53:31+05:30 IST