గిరిజనేతరుల గుర్తింపు కార్డులను మన్యంలో రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-11-29T06:21:44+05:30 IST
గిరిజనేతరులు ఏజెన్సీలో కలిగి ఉన్న ఓటరు, రేషన్ కార్డులు, విద్యుత్ కనెక్షన్లను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి శనివారం వినతిపత్రం అందజేశారు.
ఆర్డీవోకు వినతిపత్రం అందించిన జేఏసీ నాయకులు
పాడేరురూరల్, నవంబరు 28: గిరిజనేతరులు ఏజెన్సీలో కలిగి ఉన్న ఓటరు, రేషన్ కార్డులు, విద్యుత్ కనెక్షన్లను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, తాజంగి వంటి పర్యాటక ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వేసిన గుడారాలను తొలగించాలని ఆమెను కోరారు. సానుకూలంగా స్పందించిన ఆమె గుడారాలు వేసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఆదివాసీ భూములు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోని కలిసిన వారిలో జేఏసీ నాయకులు రామారావుదొర, రామకృష్ణ, నందు, ప్రసాద్నాయుడు, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.