గిరిజన నేత పాముల కృష్ణయ్య మృతి

ABN , First Publish Date - 2021-05-11T03:45:44+05:30 IST

ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతి సేవక్‌ సంఘ్‌ గౌరవ అధ్యక్షుడు, ట్రస్ట్‌ బోర్డు సభ్యుడైన గిరిజన సీనియర్‌ నాయకుడు పాముల కృష్ణయ్య వయోభారంతో ఆదివారం మృతి చెందారు.

గిరిజన నేత పాముల కృష్ణయ్య మృతి
కృష్ణయ్య (ఫైల్‌ )

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) మే 10 : ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతి సేవక్‌ సంఘ్‌ గౌరవ అధ్యక్షుడు, ట్రస్ట్‌ బోర్డు సభ్యుడైన గిరిజన సీనియర్‌ నాయకుడు పాముల కృష్ణయ్య వయోభారంతో ఆదివారం మృతి చెందారు. పద్మభూషణ్‌ వెన్నెలకంటి రాఘవయ్య అనుచరుడైన పాముల కృష్ణయ్య  గిరిజనుల అభివృద్ధికి పాటుపడ్డారని ట్రస్ట్‌ బోర్డు తెలిపింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2021-05-11T03:45:44+05:30 IST