ప్రేయసి ఫోన్ చేసి పిలవగా.. ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు పది రోజులుగా మిస్సింగ్.. పోలీసులు అతని ఆచూకీ ఎలా తెలుసుకున్నారంటే..

ABN , First Publish Date - 2022-03-14T05:42:31+05:30 IST

ఆ యువకుడి పేరు రాబిన్. ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడ్రోజుల అనంతరం రాబిన్ మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది...

ప్రేయసి ఫోన్ చేసి పిలవగా.. ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు పది రోజులుగా మిస్సింగ్.. పోలీసులు అతని ఆచూకీ ఎలా తెలుసుకున్నారంటే..

ఆ యువకుడి పేరు రాబిన్. ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడ్రోజుల అనంతరం రాబిన్ మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాబిన్ మొబైల్ తీసుకుని పరిశీలించగా చివరగా ఓ మహిళకు కాల్ వెళ్లింది. ఆ మహిళను అదపులోకి తీసుకుని విచారణ చేయగా షాకింగ్ విషయం బయటపడింది. 


గ్రేటర్ నొయిడాకు సమీపంలోని సూరజ్‌పూర్‌కు చెందిన రాబిన్‌కు ఓ యువతితో లవ్ ఎఫైర్ ఉంది. వారిద్దరూ తరచుగా కలిసి తిరిగేవారు. ఆ విషయం యువతి తల్లిదండ్రులకు, సోదరులకు తెలిసింది. వారు వార్నింగ్ ఇచ్చినా రాబిన్ తీరు మారలేదు. ఈ క్రమంలో మార్చి 1వ తేదీన రాబిన్‌కు అతని ప్రేయసి ఫోన్ చేసి తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని.. వెంటనే రమ్మని పిలిచింది.

అక్కడ రాబిన్ వెళ్లగా.. ఆ యువతి సోదరలు రాబిన్ నోటికి గుడ్డ కట్టి, ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదారు. అనంతరం విద్యుత్ వైరుతో రాబిన్ గొంతు నులిమి కిటికీకి ఉరివేశారు.


అనంతరం రాబిన్ మృతదేహాన్ని యువతి సోదరులు కారులో వేసి కోట్ గ్రామానికి సమీపంలో ఉన్న గంగానది కాలువలో పడేశారు. రాబిన్ మొబైల్ డేటా ఆధారంగా అతను చివరగా తన ప్రేయసితో మాట్లాడాడని పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు ఆ యువతి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

Updated Date - 2022-03-14T05:42:31+05:30 IST