విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-03T05:43:56+05:30 IST

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

వాజేడు, అక్టోబరు 2: తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండటంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై హరీశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడులోని పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక ముద్దయ్య, రమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్వప్న(13) భూపాలపల్లి జిల్లా కాటా రంలోని గురకులంలో ఎనిమిదో తరగతి చదు వుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. తల్లిదం డ్రులు తరచూ గొడవ పడటాన్ని చూసి మన స్తాపం చెంది పురు గుల మందు తాగి అప స్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వాజేడు పీహెచ్‌ సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తీసుకె ళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే స్వప్న మృతి చెందింది. 

Updated Date - 2022-10-03T05:43:56+05:30 IST