-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Girl commits suicide after being harassed by youths anantapur andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Anantapur: యువకుల వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-14T14:32:21+05:30 IST
యువకుల వేధింపులు తాళలేక 16ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం: యువకుల వేధింపులు తాళలేక 16ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు యువకులు ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ వేధింపులకు గురి చేశారు. యువకుల వేధింపులపై ఫిర్యాదు చేసినా కళ్యాణదుర్గం పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఈ క్రమంలో తీవ్రమనస్థాపానికి గురైన బాలిక.... తల్లి పెళ్లికి, తండ్రి బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.