స్నేహితురాలి అన్నయ్యే.. వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరింపులు.. విషం తాగేసిన విద్యార్థిని

ABN , First Publish Date - 2022-05-09T09:24:46+05:30 IST

స్కూల్లో చదువుకుంటున్న ఆ విద్యార్థినికి మరో అమ్మాయి మంచి స్నేహితురాలు. ఆ స్నేహితురాలి అన్నయ్య కూడా అదే స్కూల్లో చదివేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా చెల్లెలి ఫ్రెండ్ ఫొటోలు తీసేవాడు. దీనిపై ఆమె పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అతను వైరల్ చేసేవాడు...

స్నేహితురాలి అన్నయ్యే.. వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరింపులు.. విషం తాగేసిన విద్యార్థిని

స్కూల్లో చదువుకుంటున్న ఆ విద్యార్థినికి మరో అమ్మాయి మంచి స్నేహితురాలు. ఆ స్నేహితురాలి అన్నయ్య కూడా అదే స్కూల్లో చదివేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా చెల్లెలి ఫ్రెండ్ ఫొటోలు తీసేవాడు. దీనిపై ఆమె పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అతను వైరల్ చేసేవాడు. ఈ విషయంలో గత ఏప్రిల్ 19న ఆమె గొడవ చేయడంతో.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆ అమ్మాయిని చావబాదాడు. 


దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. పోలీసులు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు. దాంతో కేసు వాపస్ తీసుకోవాలని ఆమెపై సదరు నిందితులు ఒత్తిడి చేస్తూ.. టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఆమె అశ్లీల వీడియో తమ దగ్గర ఉందని, దాన్ని వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు. ఇవి తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వెలుగు చూసింది. 


నిగమ కుమారి అనే అమ్మాయి.. తన స్నేహితురాలి అన్నయ్య పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. అయితే ఈ కేసు భూవివాదానికి సంబంధించిందని, దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబున్నారు. ప్రస్తుతానికైతే అమ్మాయి మరణానికి కారణమైన ఎవరినీ పోలీసులు అరెస్టు చెయ్యలేదు.

Read more