పెళ్లికి తమతో పాటు వచ్చిన కూతురు అదృశ్యం.. ఫంక్షన్ హాల్ అంతా వెతికిన బంధువులు.. అనుమానంగానే బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-17T13:17:34+05:30 IST

పెళ్లి అంటేనే హడావుడి. బంధువులు ముచ్చట్లు వధువరుల కార్యక్రమాలతో కళ్యాణ మండపమంతా సందడిగా ఉంటుంది. అలాంటి సందడిలో తమ కూతురు కనిపించడం లేదంటూ పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళన పడి ఆ మండపమంతా వెతికారు

పెళ్లికి తమతో పాటు వచ్చిన కూతురు అదృశ్యం.. ఫంక్షన్ హాల్ అంతా వెతికిన బంధువులు.. అనుమానంగానే బాత్రూంలోకి వెళ్లి చూస్తే..

పెళ్లి అంటేనే హడావుడి. బంధువులు ముచ్చట్లు వధువరుల కార్యక్రమాలతో కళ్యాణ మండపమంతా సందడిగా ఉంటుంది. అలాంటి సందడిలో తమ కూతురు కనిపించడం లేదంటూ పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళన పడి ఆ మండపమంతా వెతికారు. చివరికి ఆమె అక్కడ ఒక గదిలోని బాత్రూంలో అపస్మారక స్థితిలో అర్ధనగ్నంగా పడి ఉంది. దగ్గరికెళ్లి చూడగా ఆమె ప్రాణాలతో లేదు. దీంతో పోలీసులకు వారు సమాచారమందించారు. 


అదే గదిలో మరో వ్యక్తి తప్పతాగి మత్తులో పడి ఉన్నాడు. పక్కనే లిక్కర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. దీంతో పెళ్లి పెద్దలు అతడిని చితకబాదారు. అతడు ఆ అమ్మాయిని ఏం చేశాడోనని ఆందోళనగా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ శవానికి మెడికల్ పరీక్షలు చేసి అత్యాచారం జరిగిందా?.. లేదా?.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


అలాగే పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోని పోలీసులు పరిశీలిస్తున్నారు. పెళ్లి మండపం గదిలో ఆ తాగుబోతు కాకుంగా మరెవరైనా వెళ్లి యువతిని హత్య చేశారా? అని పోలీసులు అనుమానం పడుతున్నారు.  ఆ గదిలో పడి ఉన్నా ఆ వ్యక్తిని బంధువులు చితకబాదడంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. హత్య జరిగి రెండు రోజులు గడిచినా.. ఇంకా పోలీసులు హంతుకుడి గురించి ఒక నిర్ధారణకు రాకపోవడంపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-11-17T13:17:34+05:30 IST