11 ఏళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది... ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేసింది... కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేసరికి...

ABN , First Publish Date - 2022-07-28T16:59:58+05:30 IST

ఉత్తర‌ప్రదేశ్‌లోని నోయిడాలో హడలెత్తించే...

11 ఏళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది... ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేసింది... కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేసరికి...

ఉత్తర‌ప్రదేశ్‌లోని నోయిడాలో హడలెత్తించే ఉదంతం వెలుగు చూసింది. 11 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అసభ్యకర చేష్టలు చేసి, ఆమె నుదుట బొట్టుపెట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసుశాఖలో కలకలం చెలరేగింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నలుగురు నిందితులపై బాలిక తల్లి సెక్టార్-20 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. ఈ ఉదంతం నోయిడాలోని సెక్టార్ 27లో చోటుచేసుకుంది. 


బుధవారం రాత్రి 11 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ మైనర్ నుదుట దుండగులు బొట్టుపెట్టి పారిపోయారు. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. నిందితులపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు  చేసింది. విచారణలో నిందితులు రోహిత్, శైలేంద్రతో పాటు వారికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారని తేలింది. తమ కూతురు ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉన్నట్టుండి బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చారు. ఇంతలో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే చిన్నారితో కుటుంబ సభ్యులు సెక్టార్ 20 పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి రోహిత్, శైలేంద్రలతో పాటు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ 11 ఏళ్ల కుమార్తెను బలవంతంగా బయటకు లాక్కొని వెళ్లారని సెక్టార్-27లో నివసిస్తున్న ఓ మహిళ పోలీస్ స్టేషన్ సెక్టార్-20లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ మీడియా ఇన్‌ఛార్జ్ పంకజ్ కుమార్ తెలిపారు. తమ కుమార్తెతో నలుగురు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆ మహిళ ఆ ఆరోపించిందన్నారు. 

Updated Date - 2022-07-28T16:59:58+05:30 IST