ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన అమ్మాయి... ఫుడ్ తీసుకువచ్చిన 42 మంది డెలివరీ బాయిస్!

ABN , First Publish Date - 2020-12-03T16:45:03+05:30 IST

ఫిలిప్పీన్స్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక అమ్మాయి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. కొద్దిసేపటికి...

ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన అమ్మాయి... ఫుడ్ తీసుకువచ్చిన 42 మంది డెలివరీ బాయిస్!

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక అమ్మాయి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. కొద్దిసేపటికి ఏకంగా 42 మంది డెలివరీ బాయిస్ ఫుడ్ తీసుకుని ఆమె ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచిన ఆమెకు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఫిలిప్పీన్స్‌లోని సెబూ సిటీలో స్కూలులో చదువుతున్న ఒక అమ్మాయి ఒక ఫుడ్ యాప్ సాయంతో లంచ్ ఆర్డర్ చేసింది. తరువాత తన నాయనమ్మతో కలసి ఆహారం తినేందుకు ఎదురు చూడసాగింది.


ఇంతలో ఆమె ఉంటున్న వీధిలోకి ఫుడ్ తీసుకుని ఏకంగా 42 మంది డెలివరీ బాయిస్ వచ్చారు. ఇంతమంది ఒకేసారి ఫుడ్ తీసుకుని వచ్చేసరికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతాన్ని అక్కడుంటున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. చూస్తుండగానే ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఆ ఫుడ్ యాప్‌లోని సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఆ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఒక డెలివరీ బాయ్‌కి చేరాల్సిన మెసేజ్ ఏకంగా 42 మందికి చేరింది. దీంతో వారంతా ఆహారం తీసుకుని ఆమె ఇంటికి తరలివచ్చారు.

                                               జీఎంఏ రీజనల్ టీవీ సౌజన్యంతో...

Updated Date - 2020-12-03T16:45:03+05:30 IST