స్నేహితుడి చెల్లిపై కన్నేశాడు.. ఎవరూ లేనపుడు అత్యాచార యత్నం చేశాడు.. ఆమె ప్రతిఘటించడంతో 18 సార్లు..

ABN , First Publish Date - 2022-01-26T17:36:05+05:30 IST

ఆ యువకుడు రోజు కూలిగా పనిచేస్తున్నాడు.. తన పక్కింట్లోనే ఉండే స్నేహితుడితో కలిసి రోజూ కూలి పనికి వెళుతుంటాడు..

స్నేహితుడి చెల్లిపై కన్నేశాడు.. ఎవరూ లేనపుడు అత్యాచార యత్నం చేశాడు.. ఆమె ప్రతిఘటించడంతో 18 సార్లు..

ఆ యువకుడు రోజు కూలిగా పనిచేస్తున్నాడు.. తన పక్కింట్లోనే ఉండే స్నేహితుడితో కలిసి రోజూ కూలి పనికి వెళుతుంటాడు.. ఖాళీ సమయాల్లో స్నేహితుడి ఇంటికి వెళుతుంటాడు.. ఆ క్రమంలో స్నేహితుడి చెల్లిపై కన్నేశాడు.. ఇంట్లో ఎవరూ లేనపుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.. ఆమె ప్రతిఘటించడంతో పశువులా ప్రవర్తించాడు.. కత్తితో దాడికి దిగాడు.. ఆమె శరరీంపై 18 సార్లు కత్తితో పొడిచాడు.. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది.. 


రాజస్థాన్‌లోని పాలి జిల్లా శివసాగర్ గ్రామానికి చెందిన ప్రకాష్ అనే యువకుడు రోజు కూలీగా పనిచేస్తున్నాడు. తన పక్కింట్లో ఉండే స్నేహితుడి సోదరి అయిన 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. సోమవారం సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరూ లేనపుడు లోపలికి వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. 


చుట్టుపక్కల వారు వస్తారనే భయంతో ఆమెను అదుపు చేసేందుకు ప్రకాష్ కత్తి తీసి బెదిరించాడు. అయినా ఆమె భయపడకపోవడంతో ఆమె మెడ, ఛాతీ, కాళ్లు, చేతులు, వీపు మీద మొత్తం 18 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-01-26T17:36:05+05:30 IST