టీవీ చూడొద్దన్న తల్లిపై అలిగి బాలిక ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-04T15:46:42+05:30 IST
స్థానిక మాధవరంలో ఎక్కువ సేపు టీవీ చూస్తుందని తల్లి మందలించడంతో ఏడో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం తెలుగు కాలనీకి
పెరంబూర్(చెన్నై): స్థానిక మాధవరంలో ఎక్కువ సేపు టీవీ చూస్తుందని తల్లి మందలించడంతో ఏడో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం తెలుగు కాలనీకి చెందిన నాగరాజ్ చెన్నై కార్పొరేషన్ మాధవరం మండలంలో పారిశుధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఏంజల్ (12) మాధవరం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఏంజల్ ఇంట్లో ఎక్కువ సమయం టీవీ చూస్తుండడంతో, తల్లి కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఏంజల్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.