రైల్లో అంతా నిద్రలో ఉండగా షాకింగ్ ఘటన.. యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి.. ప్రత్యక్ష సాక్షి మాటలివి..!

ABN , First Publish Date - 2022-01-11T22:32:37+05:30 IST

సోమవారం రాత్రి.. వింధ్యాచల్ ఎక్స్‌ప్రెస్.. అందరూ నిద్రలో ఉండగా ఓ వ్యక్తి కేకలు పెట్టాడు..

రైల్లో అంతా నిద్రలో ఉండగా షాకింగ్ ఘటన.. యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి.. ప్రత్యక్ష సాక్షి మాటలివి..!

సోమవారం రాత్రి.. వింధ్యాచల్ ఎక్స్‌ప్రెస్.. అందరూ నిద్రలో ఉండగా ఓ వ్యక్తి కేకలు పెట్టాడు.. ప్రయాణికులు నిద్రలో నుంచి లేచి చూడగా ఆ వ్యక్తి మొహం, చేతులు కాలిపోతున్నాయి.. వెంటనే దుప్పట్లతో ఆ మంటలను ఆపారు.. ఎవరో యువతి అతడిపై యాసిడ్ దాడి చేసింది.. ప్రస్తుతం బాధితుడు మాట్లాడే స్థితిలో లేడు.. కాబట్టి అతడి నుంచి ఎలాంటి సమాచారమూ లేదు.. మధ్యప్రదేశ్‌లోని గంజ్‌బసోదా ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. 


`నా భార్య కింద బెర్త్‌లో నిద్రపోతోంది. నేను, మా పాప మిడిల్ బెర్త్‌లో పడుక్కున్నాం. హఠాత్తుగా ఓ వ్యక్తి అరుచుకుంటూ మా బెర్త్‌ల దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో అతని మొహం, చేతులపై మంటలు ఉన్నాయి. వెంటనే నేను కప్పుకున్న దుప్పటితో ఆ మంటలు ఆర్పాను. ఎవరో అమ్మాయి అతడి మీద యాసిడ్ దాడి చేసినట్టు కొందరు చెబుతున్నార`ని ప్రత్యక్ష సాక్షి మదన్ బసాల్ తెలిపారు. బాధితుడిని సచిన్ సాహుగా గుర్తించిన రైల్వే పోలీసులు అతడి సోదరుడు లోకేష్ సాహకు సమాచారం అందించారు. 


సచిన్ సాహును భోపాల్‌లోని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం అతను మాట్లాడే పరిస్థితిలో లేడు. అతను స్పృహలోకి వచ్చి మాట్లాడిన తర్వాతే ఈ కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. బాధితుడు విదిశాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగి అని, నెల క్రితమే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది.  

Updated Date - 2022-01-11T22:32:37+05:30 IST