ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చి, ప్రియుడిని రమ్మని పిలిచింది.. వారిని అలా చూసిన ఆమె తండ్రి ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-09-09T17:48:45+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో ఓ యువకుడు...

ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చి, ప్రియుడిని రమ్మని పిలిచింది.. వారిని అలా చూసిన ఆమె తండ్రి ఏం చేశాడంటే...

ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ప్రియురాలి సోదరుడు, తండ్రి ఆ యువకుడిని పట్టుకుని కొట్టారు. యువకుడికి శిరోముండనం చేయడంతో పాటు సగం మీసాలను తొలగించారు. కుమారుడిని రక్షించేందుకు ఆ యువకుని తల్లి పోలీసులను వెంటబెట్టుకుని ఆ మహిళ ఇంటికి చేరుకుంది. ఆ యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియురాలి సోదరుడు, తండ్రిపై కేసు నమోదు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పీలీభీత్‌లోని బిల్సందా ప్రాంతానికి చెందిన ఒక వివాహిత తన భర్తతో విభేదాల కారణంగా తన తల్లి ఇంటికి వచ్చి అక్కడ నివసిస్తోంది. 


ఆమెను కలవడానికి ఆమె ప్రేమికుడు వచ్చాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు వారిద్దరినీ అభ్యంతరకర స్థితిలో చూశారు. వెంటనే ఆ మహిళ సోదరుడు, తండ్రి ఆ యువకుడిని పట్టుకొని చావబాదారు. తరువాత అతనికి శిరోముండనం చేయించి, సగం మీసాలను తొలగించారు. విషయం తెలుసుకున్న ఆ యువకుడి తల్లి పోలీసులతో పాటు ఆ మహిళ ఇంటికి చేరుకుంది. ఇరువర్గాల తరపున పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆ మహిళే తనను ఇంటికి పిలిచిందని బాధిత యువకుడు ఆరోపించాడు. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియురాలి సోదరుడు, తండ్రి, బార్బర్‌పై కేసు నమోదు చేశారు. ఇరువర్గాల వారు బంధువులేనని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అచల్ కుమార్ తెలిపారు. ఇరువర్గాలకు చెందిన ఐదుగురిని జైలుకు తరలించామని తెలిపారు.

Updated Date - 2022-09-09T17:48:45+05:30 IST