నువ్వే నా ప్రాణం అంటూ ఇంట్లోంచి వచ్చేసి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి.. రెండ్రోజుల్లోనే షాకింగ్ ట్విస్ట్.. చివరకు..
ABN , First Publish Date - 2022-06-08T18:02:43+05:30 IST
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.. పోలీసులు ఆ ఇద్దరినీ పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లారు.. అయితే అక్కడ ఆ యువతి మాట మార్చింది.. తాను తల్లిదండ్రులతోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చింది.. దీంతో పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. ప్రేయసి చేసిన పనితో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రియుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
ఇది కూడా చదవండి..
సీరియల్లో ఆ సీన్ చూస్తే నవ్వాపుకోలేరు.. ఆమాత్రం తెలియదా అంటూ నెటిజన్ల ట్రోలింగ్..!
రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి బ్లేడుతో చేతి నరాలు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో లక్ష్మణ్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. లక్ష్మణ్ కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే ఆ యువతి తల్లిదండ్రులు లక్ష్మణ్తో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువతి ఏప్రిల్ 10వ తేదీన తన ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇద్దరూ అహ్మదాబాద్ వెళ్లి ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. అయితే సరైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల ఆ పెళ్లి రిజిస్టర్ కాలేదు.
ఆ తర్వాత ఇద్దరూ జోధ్పూర్ తిరిగి వెళ్లారు. యువతి తల్లిదండ్రులు అప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వీరిని పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువతి తన స్టేట్మెంట్ మార్చేసింది. తాను తన తల్లిదండ్రులతోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పట్నుంచి లక్ష్మణ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.