బాలికలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2022-08-11T04:36:38+05:30 IST
బాలికలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ భారతి హోళికేరీ అన్నారు. బుధవారం మండలంలోని గుడిపేట రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కిశోర బాలికలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు.
- జిల్లా కలెక్టర్ భారతి హోళికేరీ
హాజీపూర్, ఆగస్టు 10: బాలికలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ భారతి హోళికేరీ అన్నారు. బుధవారం మండలంలోని గుడిపేట రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కిశోర బాలికలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలికల ఇస్తున్న పోషకాహార కిట్లను బాలికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 149 మంది బాలికలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కిట్లను వికలాంగులైన స్కూల్డ్రాపౌట్లు, 11 నుంచి 18 సంవత్సరాల బాలికలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రొటీన్ పౌడర్,ఐరన్ సిరప్, కాల్షియం టాబ్లెట్లు, నెయ్యి, ఖర్జూర, 10 కిలోల గోధుమలు ఉంటాయని తెలిపారు. ఈ కిట్లను మూడు నెలలకు ఒకసారి పంపిణీ చేస్తామని వివరించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా గుడిపేట రైతు వేదికలో అధికారులు, నాయకులో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో శివానీ డోంగ్రె, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, సీడీపీవోలు రేష్మ, హేమసత్య, ఐసీడీఎస్ సూపర్ వైజర్ ప్రసన్న, సర్పంచు లగిశెట్టి లక్ష్మీరాజయ్య తదితరులు పాల్గొన్నారు.