‘చేయూత’కు అవకాశమివ్వండి

ABN , First Publish Date - 2021-06-22T05:50:08+05:30 IST

గ్రామంలో వలంటీర్లు లేకపోవడంతో చేయూత పథకం మంజూరుకాలేదని.. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేద ని మక్కువ మండలం శంబరకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశా రు.

‘చేయూత’కు అవకాశమివ్వండి
నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

  150 మంది మహిళల వేడుకోలు

కలెక్టరేట్‌: గ్రామంలో వలంటీర్లు లేకపోవడంతో చేయూత పథకం మంజూరుకాలేదని.. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేద ని మక్కువ మండలం శంబరకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశా రు. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన 150 మంది మహిళలు తమ సమస్య ను జిల్లా అధికారులకు విన్నవించారు. కోర్టు వివాదాల నేపథ్యంలో వలంటీర్ల నియామకం జరగలేదని..దీంతో చేయూత పథకానికి సంబంధించి వివరాలు నమోదు చేయలేదన్నారు. అందుకే తాము పథకానికి దూరమయ్యామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

 

 

Updated Date - 2021-06-22T05:50:08+05:30 IST