ప్రతిభావంతులకు చేయూతనివ్వడం అభినందనీయం
ABN , First Publish Date - 2022-08-18T05:31:03+05:30 IST
ప్రతిభావంతులకు చేయూతనివ్వడం అభినందనీయం
మొయినాబాద్ రూరల్, ఆగస్టు 17: సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మండలంలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యజమాన్యం క్రీడలు, విద్య, వైద్య తదితర రంగాల్లో ప్రతిభ చూపుతున్న వారికి ‘చేంజ్ మేకర్స్’ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమాన్ని నగరంలో మంత్రితో ప్రారంభింపజేశారు. ఇతర కళాశాలల కూడా ఇంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. కళాశాల అంబాసిడర్ ఎండీ జబిఖాన్, డీన్ సుర్యానారాయణరెడ్డి పాల్గొన్నారు.